నగరంలోని డాబాగార్డెన్స్లో విషాదఘటన చోటుచేసుకుంది. ప్రహరీ గోడ కూలి ఇద్దరు కూలీలు మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి. చర్చికి సంబంధించిన పాత గోడను తొలగిస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. మృతుల కుంబీకులు కన్నీరుమున్నీరై రోదిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.