టీడీపీ సీనియర్ నేతలు కేసుల్లో ఇరుక్కుపోతున్నారు. నిన్న ఒక్క రోజే మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి... మాజీ విప్ కూన రవి కుమార్ పై పోలీసు కేసులు నమోదు అయ్యాయి. ఫోర్జరీ డాక్యుమెట్స్ తో ఇడిమేపల్లిలో 2.40 ఎకరాల భూములను అమ్మినట్టు నమోదు అయిన కేసులో సోమిరెడ్డితోపాటు మరో ముగ్గురు నిందితులుగా చేర్చారు పోలీసులు. సోమిరెడ్డి అక్రమంగా ప్రభుత్వ భూమిని అమ్ముకున్నారని ఆయన పై కేసు నమోదు చేసేలా పోలీసులను ఆదేశించాలంటూ ఇడిమేపల్లికి చెందిన రంగారెడ్డి అనే వ్యక్తి కోర్టులో కేసు వేశారు. కోర్టు ఆదేశాల మేరకు సోమిరెడ్డి మీద కేసు నమోదు చేశారు వెంకటాచలం పోలీసులు. ప్రస్తుతం విజయవాడలో ఉన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తనపై నమోదయిన కేసుల వ్యవహారాన్ని న్యాయవాదులతో చర్చిస్తున్నారు.