రాజధాని అమరావతిపై మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధానిలో ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని.. ఆ వివరాలను తగిన సమయంలో వెల్లడిస్తామని ఆయన చెప్పారు. అమరావతిలో బొత్స మీడియాతో మాట్లాడారు. రాజధానిలో జరిగిన భూ అక్రమాలపై తమ వద్ద పూర్తి సమాచారం ఉందని.. సరైన సమయంలో ఆ అక్రమాల చిట్టా బహిరంగ పరుస్తామని వ్యాఖ్యానించారు.