గర్భిణీగా ఉన్నభార్యను భర్త హతమార్చిన ఘటన చిత్తూరు జిల్లాలోని గంగవరం మండలం జగలపల్లెలో చోటుచేసుకుంది. ఉరివేసి గర్భిణి మీనా(24)ను భర్త హత్య చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. మృతురాలి కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.