అరుణ్జైట్లీ మృతి దేశానికి, బీజేపీకి తీరని లోటని బీజేపీ నేత, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. కేంద్ర మంత్రిగా, ప్రతిపక్ష నేతగా వివిధ హోదాల్లో రాణించారన్నారు. గతంలో జైట్లీ ఆయన నివాసంలో భోజనానికి పిలిచారని, ఆర్థిక సంబంధ, మౌలిక సదుపాయాల అంశాలపై చర్చించామన్నారు. జైట్లీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని కోరుకుంటున్నామన్నారు.