తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారిని శనివారం రాత్రి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం దర్శించుకున్నారు.
ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న ఎల్వీ సుబ్రహ్మణ్యంకు టిటిడి తిరుపతి జెఈవో శ్రీ టిటిడి తిరుపతి జెఈవో పి.బసంత్కుమార్, అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం వస్త్రం, అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు.