సీఎం జగన్ మతవాది అని ముద్రవేసేందుకు కుట్ర జరుగుతోందని నరసాపురం ఎంపీ కనుమూరి రఘురామకృష్ణంరాజు ఆరోపించారు. శనివారం భీమవరంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్యమత టికెట్ల అంశంపై ఆయన స్పందిస్తూ అన్ని మతాలను గౌరవంగా చూసే వ్యక్తి చంద్రబాబు నాయుడు అని ఆన్నిమతాలు సమానమేనన్న కాన్సెప్ట్తో వినియోగంలోకి తీసుకు వచ్చారని అన్నారు. చంద్రబాబు హయాంలో ప్రింట్చేసిన బస్సుటికెట్లను తెలివిగా కుట్రతో తిరుపతి రూట్లో ప్రవేశపెట్టారని అన్నారు. ఈ తప్పు ఎవరి వల్ల జరిగిందో సదరు అదికారులపై చర్యలు ఉంటాయని ఆయన స్పష్టంచేశారు. దీనికి బాధ్యులైన వారికి ఖచ్చితంగా శిక్షపడుతుందన్నారు.