తూర్పుగోదావరి జిల్లా లో అక్రమరవాణా పెరుగుతున్న నేపధ్యంలో పోలీసులు తనిఖీలు చేస్తున్నప్పటికీ కొందరు పోలీసుల కళ్లుగప్పి యధేచ్చగా గంజాయి అక్రమ రవాణా చేస్తూనే ఉన్నారు. తాజాగా శనివారం తుని పట్టణంలో పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈసందర్భంగా దియేటర్ సెంటర్ వద్ద గంజాయి అక్రమ రవాణా చేస్తున్న మహా రాష్ట్రకు చెందిన శివాజీభుజంకం, బాలాజీ అంకుష్జాదవ్అనే ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్చేశారు. వారి నుంచి 80 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు సీఐ రమేష్బాబు తెలిపారు.