ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావుకు తీవ్ర గుండెపోటు వచ్చింది. ఉదయమే అయన ఛాతి నొప్పి లక్షణాలతో ఇబ్బదులు పడుతున్నానని కుటుంబ సభ్యులకి చెప్పగా డాక్టర్ని పిలిపించి తనిఖీలు చేయించారని తెలుస్తోంది. ఐతే సాయంత్రానికి మళ్లీ నొప్పి పెరగటంతో పరిశీలించి, ఈయనని ఆసుపత్రికి తీసుకు రావాలని సూచించినట్టు సమాచారం. ప్రస్తుతం ఆయన గుంటూరులోని లక్ష్మీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.