జగన్ ప్రభుత్వం చెప్పేదానికి చేసేదానికి పొంతన లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. రాజధాని రైతులకు బీజేపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. రాజధాని రైతులు కన్నాను కలిసిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజధాని అమరావతికి అప్పుడు జగన్ అంగీకరించారన్నారు. రాజధాని వస్తుందని మూడు పంటలు పండే పొలాలను రైతులు త్యాగం చేశారన్నారు. అధికారంలోకి వచ్చాక కొందరి కోసమే వైసీపీ ప్రభుత్వం పనిచేస్తున్నట్లు కనిపిస్తోందన్నారు.