ఆధ్యాత్మిక నగరి తిరుపతిలో పోలీసులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. తమిళనాడులో ఉగ్రవాదులు ప్రవేశించారన్న నిఘా వర్గాల సమాచారంతో ఏపీ పోలీసులు అప్రమత్తమయ్యారు. తిరుమల, శ్రీకాళహస్తి ఆలయాలకు వచ్చే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అనుమానితులు కనిపిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని జిల్లా ఎస్పీ అన్బురాజన్ సూచించారు.