జాతీయ మీడియా, అంతరాష్ట్ర వ్యవహారాల్లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు గా సీనియర్ జర్నలిస్ట్ దేవులపల్లి అమర్ను నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రిగా జగన్మోహన్రెడ్డి పదవీ కాలం ఉన్నంత వరకు అమర్ ఈ పదవిలో కొనసాగుతారని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. దేవులపల్లి అమర్ సీనియర్ జర్నలిస్టు గా సుపరిచితులు. అనేక మీడియా సంస్థల్లో పనిచేసిన అమర్ ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ అద్యక్షుడిగా కొనసాగుతున్నారు.
Devulapalli Amar, appoint, adviser, AP government