పోలవరం విషయంలో హైకోర్టు తాజా తీర్పు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తొందరపాటు నిర్ణయానికి చెంపపెట్టు అని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వ్యాఖ్యా నించారు.
అధికారంలోకి రాగానే పోలవరం పవర్ ప్రాజెక్టును కొట్టేయాలని చూశారని, అందుకే వైఎస్ బంధువుతో పీటర్ కమిటీ ఏర్పాటు చేశారని ఆరోపించారు. పోలవరం పరిధిలోని 7 ముంపు మండలాలను మన భూభాగంలో కలిపేందుకు చంద్రబాబు కృషి చేశారన్నారు. ముంపు మండలాలను కలపడం వల్లే ప్రాజెక్టు పనులు ఊపందుకున్నాయని తెలిపారు. డ్యామ్ సైట్ వద్ద ప్రజలను ఖాళీ చేయించేందుకు గతంలో రూ.115 కోట్లు పరిహారం ఇచ్చామన్నారు. 2015లోనే డ్యామ్ సైట్ ఖాళీ అయిపోయిందని గుర్తు చేశారు.