గోపూజ మహోత్సవంలో భాగంగా ఇటీవల నూతనంగా నిర్మించిన శ్రీ వేంకటేశ్వర గో మందిరంలో టిటిడి ఛైర్మన్ గో పూజ నిర్వహించారు. అనంతరం శ్రీ వేణుగోపాల స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అంతకుముందు శ్రీ వేణుగోపాలస్వామివారికి అభిషేకం, వేణుగానం, ఎస్వీ వేదపాఠశాల విద్యార్థులతో వేదపఠనం, భజనలు, కోలాటం, అన్నమాచార్య సంకీర్తనాలాపన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పిడబ్ల్యు విద్యార్థినులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. సాయంత్రం హిందూ ధర్మప్రచార పరిషత్ కళాకారులతో హరికథ వినిపిస్తారు.
ఈ కార్యక్రమంలో పలమనేరు ఎమ్ఎల్ఏ శ్రీ వేంకటేష్ గౌడ్, టిటిడి సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, గోశాల సంచాలకులు డా|| కె.హరనాథరెడ్డి, డెప్యూటీ ఈవో శ్రీమతివరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.