ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తమిళనాడు సిఎం పళని స్వామిని కలసిన టిటిడి చైర్మన్.

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 23, 2019, 06:29 PM

శ్రీవారి భక్తులకు సౌకర్యవంతమైన వసతులు , స్వామి వారి దర్శనం కల్పిస్తున్నామని టిటిడి చైర్మన్  వైవి సుబ్బారెడ్డి తెలిపారు. తమిళనాడు సిఎం పళనిస్వామితో గురువారం సాయంత్రం టిటిడి చైర్మన్ సమావేశమయ్యారు.


ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా తిరుమలకు విచ్చేస్తున్న భక్తులకు టిటిడి సౌకర్యాలు కల్పిస్తోందని చెప్పారు. టిటిడి సేవలను తమిళనాడు సిఎంకు వివరించారు. భక్తులకు మరింత మెరుగ్గా సేవలందించాలని శ్రీ పళనిస్వామి సూచించారు. చెన్నైలోని


అడయార్ లో సీఎం పళని స్వామిని మర్యాదపూర్వకంగా కలసి స్వామివారి తీర్థప్రసాదాలు అందించి శాలువతో సన్మానించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com