ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నా ఇంటిని ముంచడానికే వరదలు సృషించారు : బాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 23, 2019, 01:38 PM

తాను ఉంటున్న ఇంటిని ముంచడం కోసం.. కృష్ణా పరివాహక లంక గ్రామాలన్నింటినీ ముంచారని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. నేడు కృష్ణానది వరదలపై ఆయన పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్ ఇచ్చారు. నీటి ప్రవాహానికి సంబంధించిన వివరాలన్నీ ప్రభుత్వం దగ్గర ఉన్నాయన్నారు. వరదలు వచ్చే సమయానికి రాష్ట్రంలో ప్రాజెక్టులన్నీ ఖాళీగా ఉన్నాయని చంద్రబాబు స్పష్టం చేశారు. ఆ సమయంలో వచ్చిన వరదల్ని చాలా జాగ్రత్తగా నియంత్రించే అవకాశమున్నా ఫ్లడ్‌ మేనేజ్‌మెంట్‌ చేయలేకపోయారని ఆరోపించారు. ఐదారు లక్షల క్యూసెక్కుల నీటిని మేనేజ్‌ చేయడం పెద్ద కష్టం కాదని చంద్రబాబు స్పష్టం చేశారు. ఆగస్టు 7 వరకూ రాయలసీమలోని ప్రాజెక్టులకు నీరివ్వలేదని విమర్శించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com