ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమరావతి విషయంలో ప్రభుత్వం గందరగోళం : రామకృష్ణ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 23, 2019, 01:02 PM

పోలవరం ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని సీపీఐ రాష్ట్రప్రధాన కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. ఏపీ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి ఐదేళ్లు పడుతుందని ప్రభుత్వం చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ.. పోలవరం టెండర్లు ఎందుకు రద్దు చేశారో తెలియడం లేదని, ఏకపక్షంగా నవయుగ ఇంజినీరింగ్‌ సంస్థ టెండర్లను రద్దు చేసేశారని ఆయన మండిపడ్డారు. అమరావతి విషయంలో ప్రభుత్వం గందరగోళంలో ఉందని అన్నారు. అమరావతిపై సాక్షాత్తూ మంత్రే దుష్ప్రచారం ప్రారంభించారని చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com