కేంద్రమాజీ మంత్రి చిదంబరంను ఐదు రోజుల సిబిఐ కస్టడీకి అప్పగించారు. సిబిఐ ప్రత్యేక కోర్టు చిదంబరం బెయిల్ పిటిషన్ ను కొట్టివేస్తూ ఆయనను ఈనెల 26 వరకు కస్టడీకి అప్పగిస్తూ తీర్పునిచ్చింది. సిబిఐ అధికారులు ఐదు రోజులు కస్టడీకి అప్పగించాలని కోరగా విచారించిన కోర్టు తీర్పును రిజర్వ్ లో ఉంచి దాదాపు రెండు గంటల హైడ్రామా అనంతరం తీర్పును ప్రకటించింది.