అమరావతి: పోలవరానికి సంబంధించి హైకోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వలేదని మంత్రి అనిల్ కుమార్ చెప్పుకొచ్చారు. కేవలం పవర్ ప్రాజెక్టుకు సంబంధించి మాత్రమే హైకోర్టు తీర్పునిచ్చిందని పారదర్శకంగా టెండర్ల నిర్వహణకు రివర్స్ టెండరింగ్ కు వెళ్తున్నామన్నారు. తీర్పు నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలని చర్చిస్తామని, హైకోర్టు తీర్పును గౌరవిస్తామన్నారు. పోలవరం ఆగిపోతుందని చేస్తున్న ప్రచారం అసంబద్దమని, రివర్స్ టెండర్ల పేరెత్తితే చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారన్నారని ప్రశ్నించారు.