న్యూఢిల్లి : కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరాన్ని ఐదు రోజుల కస్టడీకి పంపించాలని సిబిఐ కోరింది. సిబిఐ తరఫున సొలిసిటర్ జనరల్ తుఫార్ మెహతా కోర్టులో వాదిస్తూ చిదంబరం సహకరించడం లేదన్నారు. సిబిఐ చేసుకున్న దరఖాస్తు మేరకు కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిందని, దాని ఆధారంగా చిదంబరాన్ని అరెస్టు చేశామని మెహతా చెప్పారు.