న్యూఢిల్లి : ఐఎన్ఎక్స్ మనీ ల్యాండరింగ్ కేసులో విచారణకు కేంద్ర మాజీ మంత్రి చిదంబరం తమకు ఏమాత్రం సహకరించడం లేదని సిబిఐ కోర్టుకు తెలియజేసింది. మనీ ల్యాండరింగ్కు ఐఎన్ఎక్స్ క్లాసికల్ ఉదాహరణ అని సిబిఐ పేర్కొంది. తమ ప్రశ్నలకు చిదంబరం జవాబులు దాటవేయడమో, మౌనంగా ఉండటమో చేస్తున్నారని సిబిఐ కోర్టుకు చెప్పింది.