చెన్నై : ఐఎన్ఎక్స్ మీడియా వ్యవహారం కేసులో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు చిదంబరంను నిన్న రాత్రి సీబీఐ అధికారులు అరెస్టు చేసిన విషయం విదితమే. చిదంబరం అరెస్టుపై డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ మాట్లాడుతూ.. చిదంబరం నివాసం వద్ద సీబీఐ అధికారులు ఆయనను అరెస్టు చేసేందుకు గోడ దూకి వెళ్లారు. ఇలా చేయడం దేశానికే సిగ్గు చేటు అని స్టాలిన్ పేర్కొన్నారు. రాజకీయ విద్వేషంతోను చిదంబరంను అరెస్టు చేశారన్నారు. ముందస్తు బెయిల్ కోరినప్పటికీ ఆయనకు బెయిల్ రాకుండా చేసి అరెస్టు చేయడం అన్యాయమన్నారు. చిదంబరం అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని స్టాలిన్ స్పష్టం చేశారు.