టిటిడి ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో తిరుమలలోని గోగర్భం డ్యామ్ వద్ద ఆగస్టు 23న గోకులాష్టమి వేడుకలు నిర్వహిస్తారు. ఇక్కడి ఉద్యానవనంలో వెలసిన కాళీయమర్ధనుడైన శ్రీకృష్ణునికి మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట మధ్య అభిషేకం, నైవేద్యం సమర్పిస్తారు. ఈ సందర్భంగా అన్నదానం, ఉట్లోత్సవం నిర్వహిస్తారు.