నాగలాపురంలోని శ్రీ వేదనారాయణస్వామివారి ఆలయంలో శుక్రవారం ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, మూలవర్లకు అభిషేకం, శుద్ది నిర్వహించనున్నారు. సాయంత్రం 5.30 నుండి 6.30 గంటల వరకు శ్రీ కృష్ణ స్వామివారికి అభిషేకం, అనంతరం గోకులాష్టమి ఆస్థానం, నివేదన చేయనున్నారు.
ఆగష్టు 24వ తేదీ శనివారం ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, తోమాల, పంచాంగ శ్రవణం చేయనున్నారు. సాయంత్రం 5.30 నుండి 6.30 గంటల వరకు శ్రీ కృష్ణ స్వామివారి వీధి ఉత్సవం, ఉట్లోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు.