విజయవాడ: కృష్ణాజిల్లాలో భారీ వర్షం కురిసింది. వర్షానికి గన్నవరం విమానాశ్రయం జలమయమైంది. విమాశ్రయం కార్యాలయ గదిలోకి వర్షపు నీరు చేరింది. కార్యాలయపై భాగం దెబ్బతినడంతో లోపలకి నీరు చేరినట్లుగా తెలుస్తుంది. వీఐపీల విశ్రాంతి హాలు, సిబ్బంది గదుల్లోకి వర్షాలు నీరు చేరింది. విమానాశ్రయ సిబ్బంది నీటిని బయటకు పంపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. విమానాశ్రయ డైరెక్టర్ మధుసూదనరావు నీరు చేరిన గదులను పరిశీలించి పలు ఆదేశాలిచ్చారు.