బీజేపీ అధికార ప్రతినిధి ఆంజనేయరెడ్డి ఏపీ ప్రభుత్వం నిర్ణయాలన్నీ తుగ్లక్ పనుల్లా ఉన్నాయన్నారు. పోలవరం, విద్యుత్ పీపీఏలఫై కేంద్రం వద్దని వారించినా ఏపీ ప్రభుత్వం దూకుడుగా ముందుకు వెళ్లడం ఏమిటని, రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో తలపడుతుందా? అని ప్రశ్నించారు. అమరావతిలో ముంపని ఒకసారి.. అవినీతి అని మరోసారి రాష్ట్రాన్ని గందరగోళంలోకి నెట్టారన్నారు. ప్రభుత్వ నిర్ణయాలతో ప్రజలలో గందరగోళం ఏర్పడిందని, రాజధాని పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా? లేదా?, అమరావతి ఉంటుందా? మారుస్తారా? రాజధానిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలన్నారు. పోలవరం విషయంలో ఏకపక్షంగా నవయుగ టెండర్లను రద్దు చేశారని, హోదాతో రాయతీలు వస్తాయని చెబుతూనే కియా రాయతీలు ఎలా రద్దు చేస్తారని, అన్నక్యాంటీల రద్దు అన్నది వ్యవస్థలను నాశనం చేయడమేనని, రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలన్నీ తుగ్లక్ పనుల్లా ఉన్నాయన్నారు.