బార్మర్: ఇండియన్ ఎయిర్ఫోర్స్ (ఐఏఎఫ్) జవాన్లు ప్రయాణిస్తున్న ట్రక్కు ప్రమాదవశాత్తు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా..ఐదుగురికి గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని బార్మర్లోని ఆస్పత్రికి తరలించారు. చౌహాన్ టౌన్ నుంచి వస్తోండగా ట్రక్కు అదుపుతప్పి లోయలో పడిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది.