రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హిందూ వ్యతిరేకి అని దుష్ప్రచారం చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… కోడెల స్థాయి చాలా తగ్గిపోయిందన్నారు. కోడెలపై టీడీపీ వాళ్లే కేసులు పెడుతున్నారన్నారు. అమరావతి, పోలవరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి వెలికితీస్తామని అంబటి తెలిపారు. రాజధాని మారుస్తున్నట్లు వస్తున్న అపోహలు నమ్మవద్దన్నారు. సదావర్తి భూములను చంద్రబాబు మింగేసినప్పుడు ఏం చేశారని ఆయన ప్రశ్నించారు.