ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీలు ఏకగ్రీవం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 20, 2019, 05:30 PM


రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో ముగ్గురు ఎమ్మెల్సీల ఎన్నిక ఏకగ్రీవమైంది. ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న మూడు స్థానాలకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ తరపున రాష్ట్ర మంత్రిగా ఉన్న మోపిదేవి వెంకటరమణ, మైనార్టీ నేత మహ్మద్‌ ఇక్బాల్‌, కర్నూలు జిల్లాకు చెందిన సీనియర్‌ నేత చల్లా రామకృష్ణారెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు. అయితే ఈ ముగ్గురు ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు రిటర్నింగ్‌ అధికారి ప్రకటించారు. అనంతరం మహ్మద్‌ ఇక్బాల్‌, చల్లా రామకృష్ణారెడ్డి ఎమ్మెల్సీలుగా ధ్రువీకరణ పత్రాలు అందుకున్నారు. కాగా, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి పూర్తి స్థాయిలో మెజారిటీ ఉండటంతో ప్రతిపక్ష టీడీపీ నుంచి ఎవరు బరిలో నిలువలేదు.
తెలంగాణ రాష్ట్రంలో మాజీ ఎంపీ, టీఆర్‌ఎస్‌ నేత గుత్తా సుఖేందర్‌ రెడ్డి ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక నామినేషన్‌ ఉపసంహరణకు గడువు ముగిసింది. గుత్తా ఒక్కరే నామినేషన్‌ దాఖలు చేసి ఉండటంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యుల నుంచి గుత్తా సుఖేందర్‌రెడ్డి ధ్రువపత్రం అందుకున్నారు.




 


 







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com