రాష్ట్రంలో గోదావరికి మళ్లి వరదలు వచ్చే అవకాశం ఉందని ఆర్టీజీఎస్ పేర్కొంది. ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. శబరి, ఇంద్రావతి, దిగువ గోదావరి పరివాహక ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని, ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆర్టీజీఎస్ సూచించింది.