ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వరదలకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం: గల్లా జయదేవ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 20, 2019, 12:10 PM

కృష్ణా జిల్లాలోని లంక గ్రామాల్లో  టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌ పర్యటించారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అక్కడి ప్రజలు దుర్భర పరిస్థితుల్లో ఉన్నారని.. ఇది కనిపించని సీఎం అమెరికాలో హాయిగా పర్యటనలు చేస్తున్నారని దూయబట్టారు. దీనికి సంబంధించి  ఎంపీ గల్లా జయదేవ్ ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. వర్షాలు లేకుండా ఇప్పటివరకూ ఇంత వరదని తాము చూడలేమంటూ.. అక్కడి ప్రజలు వాపోయారంటూ.. జయదేవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.’వర్షాలు లేకుండా ఇంతవరకు ఎప్పుడు ఇలాంటి వరదలు చూడలేదని.. అక్కడి ప్రజలు వాపోయారన్నారు. మహారాష్ట్ర , కర్నాటక రాష్ట్రాల నుంచి ముందు సమాచారం వచ్చినా.. జగన్ ప్రభుత్వం.. సరైన చర్యలు తీసుకోకుండా ఒకేసారి డ్యామ్ గేట్స్ ఓపెన్ చెయ్యటం వల్లనే ఇంత అనర్థం చోటుచేసుకుందని.. దీన్ని ప్రభుత్వ నిర్లక్ష్యమనలా? ప్రభుత్వ అసమర్థత? అనాలా’ అంటూ ఎంపీ గల్లా జయదేవ్ ప్రశ్నించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com