ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఢిల్లీకి వరద ముప్పు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 20, 2019, 11:23 AM

దేశ రాజధాని ఢిల్లికి వరద ముప్పు పొంచి ఉంది. యమునా నది ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తోంది. దీంతో నదీ పరివాహక ప్రాంతాలకు వరద ముప్పు పొంచి ఉంది. హితినీకుంద్‌ బ్యారేజీ నుంచి యమునానదికి భారీగా వరద నీరు వస్తోంది. యమునానదిలో 204.5 మీటర్లకు గాను 205.94 మీటర్లకు వరద ప్రవాహం చేరుకుంది. దీంతో అప్రమత్తమైన అధికారులు 10వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పాత ఢిల్లిలోని ఇనుప వంతెనపై వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ఢిల్లి ప్రభుత్వం ముందు జాగ్రత్తగా యమునానదిలో 53 బోట్లను సిద్ధం చేసింది. ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ యమునా నదిలో వరద పరిస్థితిని సమీక్షిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com