గ్రామ సచివాలయ వ్యవస్థకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రూపకల్ప న చేసారని ఈ వ్యవస్థను విజయవంతం చేసే దిశగా కృషి చేయాలని కోరారు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ . బొబ్బిలి నియోజకవర్గ స్థాయి గ్రామ, వార్డు వలంటీర్ల సదస్సు సోమవారం బొబ్బిలి లోని రామా టాకీస్ లో జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిరుపేదలే లక్ష్యంగా ప్రభుత్వ కార్యక్రమాలు అందించాలని సూచించారు. వాలంటీర్లు రాజకీయాల జోలికి పోవద్దని, అవినీతికి పాల్పడవద్దని మంత్రి కోరారు.
ప్రజల కష్ట సుఖాల్లో చేదోడు వాదోడుగా వుంటూ వారికి ప్రభుత్వం నుండి అవసరమైన సహాయాన్ని అందించడం ద్వారా ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని వాలంటీర్లకు సూచించారు. ఏంతో మంచి ఆశయంతో ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని తమ పరిధిలోని కుటుంబాలకు అందించడం ద్వారా ప్రభుత్వం తమకు అండగా ఉందనే భరోసా ఆయా కుటుంబాల్లో కలిగించాలని కోరారు.