ట్రెండింగ్
Epaper    English    தமிழ்

25న విజయవాడలో విఆర్ఓల సంఘ రాష్ట్ర సదస్సు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 20, 2019, 12:37 AM

గ్రామ రెవెన్యూ అధికారుల రాష్ట్ర సదస్సు పోస్టర్ ను నెల్లూరు   జిల్లా   కలెక్టర్ ఎంవి శేషగిరిబాబు ఆవిష్కరించారు.  సోమవారం తన ఛాంబర్లో  మాట్లాడుతూ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర సదస్సు విజయవంతం కావాలని కోరారు. 


ఈ సందర్భంగా గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పంట అశోక్ కుమార్ రెడ్డి దారా వెంకట రమణయ లు మాట్లాడుతూ ఈనెల 25వ తేదీ విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నామన్నారు.ఈ సదస్సుకు రాష్ట్ర డిప్యూటీ సీఎం మరియు రెవిన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ హాజరవుతున్నారన్నారు. 110 జీవో ను సవరించాలని ప్రధాన డిమాండ్ తో  ఈ సదస్సు జరుగనుందని ఏపీ లోని అన్ని  మండలాల నుండి విఆర్వోలు ఈ కార్యక్రమానికి  హాజరు కావాలని  పిలుపునిచ్చారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com