సర్వర్ సమస్యతో రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలు పాక్షికంగా నిలిచి పోయాయి. మూడు రోజుల నుంచి శస్త్రచికిత్సలకు ముందస్తు అనుమతు లు(ప్రీ ఆథరైజేషన్లు), డిశ్చార్జులు ఆగిపోయాయి. నెట్వర్క్ ఆస్పత్రులు కొత్తగా రోగులను చేర్చుకు నేందుకు అనుమతులు లభించకపోగా, ఇప్పటికే శస్త్ర చికిత్సలు పూర్తి చేసుకున్న రోగులను ఇంటికి పంపించేం దుకు కూడా ట్రస్ట్ నుంచి అనుమతులు రావడం లేదు. దీంతో ఎక్కడి కక్కడ వైద్య సేవలు నిలిచిపోయాయి. కొన్ని రోజుల క్రితం ఆరోగ్యశ్రీ ట్రస్ట్లో సాఫ్ట్వేర్ మైగ్రేషన్ జరిగింది.టీసీఎస్ సంస్థ కేపీఎంజీ సంస్థకు మధ్య బయోమెట్రిక్ మైగ్రేషన్ జరిగింది. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ ట్రస్ట్లో సాఫ్ట్వేర్ సేవలన్నీ కేపీఎంజీ సంస్థ అందిస్తోంది. మైగ్రేషన్ పూర్తైన తర్వాత ట్రస్ట్ అధికారులు కొత్త సర్వర్ను అందుబాటులోకి తెచ్చారు. అప్పటి నుంచి ట్రస్ట్ సేవలు చాలా నిదానంగా జరుగుతున్నాయి.