కర్నూలు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం లో రాఘవేంద్ర స్వామి 348 వ సప్త ఆరాధనోత్సవాలు అంగరంగ వైభవంగా కన్నుల జరుగుతున్నాయి. ఉత్సవాలు పురస్కరిం చుకుని 4 వ రోజున మధ్యారధన సందర్భంగా గజవాహ నోత్సవం ఘనంగా నిర్వహించారు. గజవాహనోత్సవం కు పంచ రథోత్సవాలపై ఉత్సవ ముర్తి ప్రహ్లాదరాయులకు ఉంచి శ్రీ మఠం పీఠాధిపతి శ్రీ సుభుదేంద్ర తీర్థులు ప్రత్యక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున నుంచే స్వామి వారికి తులసి, విషేశ పంచాంబృత అభిషేకం నిర్వహించారు. ఉత్సవమూర్తి ప్రహ్లాద రాయలను మఠం ప్రాకారంలో గజవాహనోత్సవం నిర్వహించి వేద పండితుల మంత్రోర్చనలు లతో పూజలు చేసి ఉంజల్ సేవ ఘనంగా నిర్వహించారు. అనంతరం గజ, చెక్క, వెండి, బంగారు, నవరత్న రథోత్సవాలపై ప్రహ్లాదరాయుల ఉత్సవ ముర్తిని అశీనులు చేసి మేళ తాళాలు, నృత్యాలు, భక్తి గీతాలు ఆలపిస్తూ భజన భజంత్రీలు, నమో రాఘవేంద్ర అంటూ శ్రీ మఠం ప్రాకారం చూట్టూ కన్నుల పండుగగా ఊరేగించారు. రథోత్సవం లో ప్రాకారం లో కళాకారులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భరతనాట్యం, కూచిపూడి నృత్య ప్రదర్శనలు భక్తులకు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ ఉత్సవాలు తిలకించేందుకు దేశ నలుమూలల నుంచి ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణ ప్రాంతాలు నుంచి వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దీంతో శ్రీ మఠం ప్రాకారం లో భక్తులతో కిక్కిరిసింది.