బీహార్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ మిశ్రా మృతి పట్ల ఏపీ సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మిశ్రా సేవలు నిరుపమానమని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. ఆయన మృతికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఒక నిబద్ధత కలిగిన నేతగా మిశ్రా నేటితరం రాజకీయ నేతలకు ఆదర్శప్రాయమన్నారు.