ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమలలో శ్రీవారి మెల్ చాట్, ఉత్తరీయాలు వేలం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Aug 19, 2019, 06:22 PM

శ్రీవారికి  తిరుమలలో భక్తులు మెల్ చాట్, ఉత్తరీయాలను కానుకగా సమర్పిస్తుంటారు. వీటిని ఇప్పుడు వేలం ద్వారా విక్రయించాలని టీటీడీ భావిస్తోంది. రేపటి నుంచి ఈ వస్త్రాలను ఆన్ లైన్ ద్వారా ఈ వేలం ప్రక్రియలో విక్రయానికి ఉంచనున్నారు. ఇదిలా ఉండగా ఈ ఉదయం 5 గంటల సమయానికి తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 11 కంపార్టుమెంట్ల లో భక్తులు వేచి చూస్తున్నారు. సర్వ దర్శనానికి 5 గంటలు, ప్రత్యేక, టైమ్ స్లాట్ దర్శనాలకు 3 గంటల సమయం పడుతోంది. ఆదివారం నాడు స్వామివారిని 95,722 మంది భక్తులు దర్శించుకున్నారు. 40,481 మంది తలనీలాలు సమర్పించారు. రూ. 2.49 కోట్ల ఆదాయం హుండీలో కానుకల ద్వారా లభించింది. 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com