కాశ్మీర్ వ్యవహారంలోకి ఆఫ్ఘనిస్తాన్ ను లాగొద్దని ఆఫ్ఘనిస్తాన్ రాయబారి రహ్మాన్ అమెరికాకు లేఖ రాశారు. దాన్ని ట్విట్టర్లో పోస్టు చేశారు. అమెరికాకు పాకిస్తాన్ రాయబారి అసద్ మజీద్ ఖాన్ తమ దేశం పై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని అన్నారు. కాశ్మీర్ లో పరిస్థితులు ఆఫ్ఘన్ పై ప్రభావం చూపవన్నారు. తమ దేశం నుంచి పాకిస్తాన్ కు ఎలాంటి ప్రమాదం లేకపోయినా పశ్చిమ సరిహద్దుల్లో పాకిస్తాన్ సైన్యాన్ని ఎందుకు మోహరించిందో అర్థం కావడంలేదని రహ్మాన్ పేర్కొన్నారు. 370 ఆర్టికల్ రద్దు ఆఫ్ఘన్ లో శాంతి భద్రతలపై ప్రభావం చూపుతుందని పాక్ వ్యాఖానించడంతో ఆఫ్ఘన్ రాయబారి ఆగ్రహం వ్యక్తం చేశారు.