తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నివాసంపై డ్రోన్ వినియోగించడంపై కోర్టులో ప్రైవేటు కేసు దాఖలు చేయాలని నిర్ణయించామని మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే కింజరాప్ అచ్చెన్నాయుడు అన్నారు. ఈ ఘటనపై గవర్నర్ ను కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… చంద్రబాబు నివాసంపై డ్రోన్ వినియోగించే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఈకేసులో ముఖ్యమంత్రి జగన్ పేరును కూడా చేరుస్తామన్నారు. లంక గ్రామాలు మునిగిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే పట్టించుకోకుండా చంద్రబాబు నివాసం చుట్టూ తిరుగుతున్నారన్నారు.