2019 సెప్టెంబర్ నెలలో ఏపీ ప్రభుత్వం రచ్చబండ కార్యక్రమం నిర్వహించనుంది. రచ్చబండ పేరిట రాష్ట్రంలోని 13 జిల్లాల్లో సీఎం జగన్ పర్య టించనున్నారు. ఈమేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమం సెప్టెంబరు 2న చిత్తూరు జిల్లా నుండి ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. సీఎం జిల్లాల పర్యటనలకు వెళ్లే లోగా కొన్ని కార్యక్రమాలను అమలు చేసే పనిలో మంత్రులు, అధికార యంత్రాంగం ఉన్నారు. సీఎం జగన్ ప్రజలతో మమేకమై మరింత దూకుడు పెంచనున్నారు. సెప్టెంబరు నుండి జిల్లా పర్యటనలతో పాటు తమ మేనిఫెస్టోలోని అంశాలను క్షేత్రస్థాయిలో అమలు చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం అధికార యంత్రాంగంతోపాటు పార్టీ నేతలకు స్పష్టమైన ఆదేశాలు ఇప్పటికే అందాయి. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి రచ్చబండ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అదే కార్యక్రమాన్ని సీఎం జగన్ మరోసారి నిర్వహించనున్నారు. ఈ పేరుతో జనంలోకి విస్త్రతంగా వెళ్లాలని భావిస్తున్నారు.