ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యమున నదిలో ప్రమాదకరస్థాయిలో వరద ఉధృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Aug 19, 2019, 12:04 PM

ఢిల్లీలోని యమున నదిలో ప్రమాదకరస్థాయిలో వరద ఉధృతి ప్రవహిస్తోంది. హర్యానా, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్‌లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. హర్యానాలోని హత్నికుంద్ బ్యారేజ్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో దిగువకు 8 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో.. యమునా నది ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తోంది. యమునా ప్రమాదకర హెచ్చరిక 204 మీటర్లు కాగా, డేంజర్ లెవల్ మార్క్ 204.50 మీటర్లు. ఇవాళ ఉదయం 204.70 మీటర్ల వద్ద వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com