ప్రత్తిపాడు మండలం ధర్మవరంలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఆగిఉన్న లారీని ఆటో ఢీకొట్టడంతో ఈ సంఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఏడుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ప్రత్తిపాడు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతులు మలికిపురం మండలం మట్టపర్రు వాసులుగా గుర్తించారు. తలుపులమ్మలోవ ఆలయానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది.