అనంతపురం జిల్లా పాతురు లో పురాతన ఆలయమైన చెన్నకేశవ స్వామి గుడి లో చోరీ జరిగింది. దొంగలు పక్కా ప్లాన్ తో స్వామి వారి హుండీలోని డబ్బులు, కానుకలను ఎత్తుకెళ్లారు. ఆలయంలోకి ప్రవేశించిన దొంగలు సీసీ కెమెరాలు, మానిటర్ లను కూడా ధ్వంసం చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆలయంలో పరిశీలించారు. నిత్యం రద్దీ గా వుండే ప్రాంతం లో చోరీ జరగడం పై అన్ని తెలిసిన వారే చోరీ చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.