తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు ఇతర అనుబంధ ఆలయాలకు హుండి ద్వారా భక్తులు కానుకగా సమర్పించిన మేల్చాట్ మరియు ఉత్తరీయం వస్త్రాలను ఆగస్టు 19 నుండి 21వ తేదీ వరకు విశాఖపట్నంకు చెందిన MSTC Ltd ఆధ్వర్యంలో ఈ-వేలం వేయనున్నారు.
ఇందులో క్రొత్తవి/ఉపయోగించిన/పాక్షికంగా దెబ్బతిన్న మేల్చాట్ మరియు ఉత్తరీయం వస్త్రాలు ( మొత్తం 1132 నం..) -155 లాట్లు (ఇ.ఎ.నెం.14254, 14255, 14256, 14257, 14258, 14259, 14260 మరియు 14262 నెంబర్లు) MSTC Ltd, ఈ-ఫ్లాట్ఫాంలో ఉంచారు.
ఇతర వివరాలకు తిరుపతిలోని టిటిడి మార్కెటింగ్ కార్యాలయాన్ని 0877-2264429, 2264221నంబర్లలో కార్యాలయం వేళల్లో, టిటిడి వెబ్సైట్ www.tirumala.org/ www.mstcecommerce.com /www.mstcindia.co.in సంప్రదించగలరు.