ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఆసుపత్రిలోని మొదటి అంతస్తులో ఉన్న ఎమర్జెన్సీ వార్డులో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 22 ఫైరింజన్లతో ఆసుపత్రి వద్దకు చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొస్తున్నారు. మొదటి అంతస్తులో ప్రమాదం జరగ్గా.. రెండో అంతస్తు వరకు పొగలు వ్యాపించాయి. మరోవైపు మంటలు చెలరేగడంతో రోగులు, బంధువులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇదిలా ఉంటే ఇదే ఆసుపత్రిలో కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీకి కూడా చికిత్స అందిస్తుండగా.. ఆయన మరో బిల్డింగ్లో ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. కాగా ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.