ప్రధాని నరేంద్ర మోదీపై ఎప్పుడూ పదునైన విమర్శలు చేసే కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం మొట్ట మొదటిసారిగా ఆయన నిర్ణయాలను స్వాగతించారు. మోదీ పంద్రాగస్టు ప్రసంగంలో మూడు అంశాలు బాగున్నాయని మెచ్చుకొన్నారు. ఈ మేరకు వరుస ట్వీట్లు చేశారు. జనాభా నియంత్రణ, ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ప్రజలు ఉద్యమించాలన్నారు. జనాభా నియంత్రణ, సంపదను సృష్టించే వారి పట్ల గౌరవాన్ని కలిగి ఉండటం, ప్లాస్టిక్ రహిత సమాజం కోసం కృషి. ఈ మూడు అంశాలను అందరూ స్వాగతించాలి. అని ట్వీట్ చేశారు.