రాష్ట్రంలో వరద బాధితులకు టీడీపీ నేతలు, కార్యకర్తలు అండగా ఉండాలని మాజీ సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. కృష్ణా, గోదావరి నదులు ఉప్పొంగుతున్నాయని, వరదలు మరింత ఉధృతం కావచ్చని, లోతట్టు ప్రాంతాల ప్రజలందరూ సురక్షిత ప్రాంతాల వెళ్లాలని సూచించారు. తెలుగుదేశం కార్యకర్తలు, నేతలంతా అప్రమత్తంగా ఉండి, ప్రజలకు ఎలాంటి అవసరం వచ్చినా ముందుండి సహాయ సహకారాలు అందించాలని ఆయన ట్విట్టర్ ద్వారా కోరారు.