ఏపీలోని చంద్రబాబు ఇంటిపై జరుగుతున్న రాజకీయంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. ఈ అంశంలో పరస్పరం విమర్శలు చేసుకుంటున్న బీజేపీ, టీడీపీలను కన్నా టార్గెట్ చేశారు. రాష్ట్రంలో వరదల సమయంలో ప్రజల బాగోగులు అక్కరలేని సీఎం జగన్ మోహన్ రెడ్డి అమెరికా వెళ్లారని సెటైర్ వేసిన కన్నా లక్ష్మీనారాయణ... 5 ఏళ్ళు రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచినాయన 'కొంప మునిగి' హైదరాబాద్ జారుకున్నాడని పరోక్షంగా టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై సెటైర్ వేశారు. వారిద్దరి 'తోక నేతలు'చేస్తున్న చర్చ"ఇల్లు మునిగిందా,లేదా"? అని వాదించుకోవడాన్ని తప్పుపట్టారు.