పోలవరం ప్రాజెక్టు రివర్స్టెండరింగ్ జిమ్మిక్లా కనిపిస్తోందని బీజేపీ నేత, ఎంపీ సుజనాచౌదరి అన్నారు. ఈరోజిక్కడ ఆయన మాట్లాడుతూ ప్రజాసేవే లక్ష్యంగా ప్రభుత్వం పని చేయాలన్నారు. వ్యక్తిగత కక్షలతో రాష్ట్రానికి నష్టం చేస్తున్నారని విమర్శించారు. వరదపై కర్ణాటక ముందే సమాచారం ఇచ్చిందని, ప్రభుత్వం, అధికారులు ఏం చేస్తున్నారు? అని ప్రశ్నించారు.